అందుకే అవంతి టీడీపీని వీడుతున్నాడా..?

-

  1. this-may-be-the-reason-for-avanthi-to-join-in-ycp

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైస్సార్సీపీలో చేరుతాడని ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ టీడీపీని ముఖ్య నేతలు వీడుతున్నారు. దానికి నిదర్శనమే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలో చేరడం.

తాజాగా ఎంపీ అవంతి కూడా వైసీపీలో చేరబోతున్నారు. మంత్రి గంటాతో ఉన్న విభేదాల వల్లనే అవంతి వైసీపీలో చేరుతున్నారట. భీమిలి సీటు తనకు కావాలని అవంతి అడిగారట. అయితే గంటా కూడా భీమిలి సీటు పైనే ఆశలు పెట్టుకోవడంతో అవంతికి భీమిలి సీటు దక్కక పోవచ్చని తెలుస్తోంది. వైస్సార్సీపీ నుంచి భీమిలి సీటును అవంతికి ఇవ్వడానికి జగన్ ఒప్పుకోవడంతో వైసీపీలో చేరడానికి అవంతి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అవంతి ఇవాళ జగన్ ను కలిసిన అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ను ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news