తెలంగాణలో కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ.. టీఆర్ఎస్ లోకి ముగ్గురు ఎమ్మెల్యేలు

-

ఇఫ్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణలో సగం ఖాళీ అయిపోయింది.

తెలంగాణలో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుమరుగైపోతున్న సందర్భంలో మరో షాక్ తగిలింది. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్నారు.

వీరంతా ఈనెల 24 న కారెక్కనున్నారు. ఇఫ్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణలో సగం ఖాళీ అయిపోయింది. దానికి తోడు తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతుండటంతో త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ కు కూడా టీడీపీకి పట్టిన గతే పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version