పార్టీ గుర్తు ఉన్న మాస్క్ పెట్టుకుని పోలింగ్ బూత్ కి వచ్చిన తెరాస కార్యకర్తలు

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని కొన్ని ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని చోట్ల కారులో వచ్చి కొందరు డబ్బులు పంచుతున్నారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని పట్టుకుని చితకబాదారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక తెరాస కార్యకర్తలు కొందరు పార్టీ గుర్తు ఉన్న మాస్క్ పెట్టుకుని ఓటు వేయడానికి రావడం వివాదం రేపింది. దీనితో గొడవ చోటు చేసుకుంది.

ఇంకా కొందరు అభ్యర్ధుల తరుపున ప్రచారం కూడా చేయడం వివాదం అయింది. తార్నాకలో మాస్క్ ల మీద పార్టీ గుర్తులు ఉన్నాయి. ఇక సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటులు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక రీ పోలింగ్ నేపధ్యంలో కొన్ని ప్రాంతాలల్లో ఎన్నికల సంఘం రేపటికి ఏర్పాట్లు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news