శంకరన్న ఏందన్న ఇది.. హోలీ వేళ కార్యకర్తలకు మందు పోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

-

ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కుకున్నారు. హోలీ వేళ బహిరంగంగా తన అనుచరులకు, కార్యకర్తలకు మందు పోస్తూ చిందేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ హోలీ వేడులకల్లో కలర్ ఫుల్ రంగులు ఓకే కానీ.. మద్యం లేకపోతే ఎలాగని అనుకున్నాడో ఏమో.. వెంటనే మందు బాటిళ్లు అందుకుని స్వయంగా ఆయన చేతులతోనే కార్యకర్తలు, అనుచరుల నోట్లో మందు పోస్తూ హంగామా చేశారు. ఈ వేడుకను వీడియో తీసిన కొంత మంది సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఎమ్మెల్యే తీరుపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండి బహిరంగంగా ఇలాంటి పనులు చేయవచ్చా…? అని ఫైర్ అవుతున్నారు. 

గతంలో కూడా శంకర్ నాయక్ పలు వివాదాల్లో ఉన్నారు. నాలుగేళ్ల క్రితం ఓ మహిళ కలెక్టర్ తో మిస్ బిహేవ్ చేశారు. అప్పట్లో ఈ ఘటన చాలా చర్చనీయాంశం అయింది. మరోసారి రెడ్డి, వెలమ కులం వాళ్లకు బలుపు ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోసందర్భంలో పోడుభూముల వ్యవహారంలో అటవీ అధికారులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news