తెలుగుదేశానికి ఊహించని దెబ్బలు… అంత మంది పార్టీ మారుతున్నారా..?

-

ఒకవైపు అధికారం కోల్పోయి ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జగన్ ఇస్తున్న షాకులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇసుక దీక్ష అంటూ చంద్రబాబు గురువారం చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ నేతలే గండి కొట్టే అవకాశాలు కనపడుతున్నాయి. పలు జిల్లాల నుంచి తెలుగుదేశం క్యాడర్ భారీగా వైసీపీ లో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ కి కంచుకోట గా ఉన్న కృష్ణా జిల్లాలో నాయకులు ఊహించని దెబ్బ కొట్టే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

ముఖ్యంగా తెలుగు యువత అధ్యక్షుడి గా ఉన్న దేవినేని అవినాష్ పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. ఇక గుంటూరు జిల్లా నుంచి మరికొందరు నేతలు తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ గా ఉన్నట్టు సమాచారం. ఇన్నాళ్ళు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చిన ఇద్దరు మాజీ మంత్రులు, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా వైసీపీ కండువా కప్పుకునే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఇక గంటా శ్రీనివాసరావు కూడా గురువారమే బిజెపిలో చేరతారని తాజాగా జరిగిన కొన్ని పరిణామాలు చెప్తున్నాయి.

ఇక విజయవాడలో భారీగా దేవినేని అభిమానులు, పెనమలూరు, తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ వ్యతిరేక వర్గం పార్టీ మారేందుకు సిద్దమైంది. ఇక బందరు పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా భారీగా వైసీపీ లో చేరికలు ఉంటాయని సమాచారం. పెర్ని నాని తో పలు నియోజకవర్గాల స్థానిక నాయకులు ఇటీవల సమావేశం నిర్వహించారు. వారందరూ కూడా పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారు. కంచుకోట గా ఉన్న కృష్ణా జిల్లా నుంచి ఈ పరిణామాలు చోటు చేసుకోవడం అధినేత చంద్రబాబు ని ఇప్పుడు కలవరానికి గురి చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news