గ్రేటర్‌ ఎన్నికల్లో కేంద్ర మంత్రుల ప్రచారం టీఆర్‌ఎస్‌కే లాభం..!

-

గ్రేటర్‌లో ఎన్నికల జాతర ముగిసింది..నగరంలో మైకులు మూగబోయాయి..లీడర్ల లొల్లి లేదు..ఇప్పుడు అభ్యర్థులు తమ తల మార్చుకొవడానికి, ఎన్నికల్లో గెలవడానికి నోట్లపై ఆధారపడుతున్నారు..గత పక్షం రోజులుగా గ్రేటర్‌ ప్రచార హోరుసాగింది..రాజకీయ పార్టీల నేతలలతో భాగ్యనగరం జాతరలా తలపించింది..ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు తుటాలుగా పేలాయి..ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు..సమాధులు కూల్చుడు, సర్జికల్ స్ట్రైక్‌లు వంటి భావోద్యేగాల మాటలతో గ్రేటర్ ప్రజలకు రెచ్చగొట్టే నేతల వ్యాఖ్యలతో భాగ్యనగరం హీటెక్కింది..ఇవి గ్రేటర్ ఎన్నికల లేక జాతీయ పార్లమెంట్ ఎన్నికల అన్న భావన ప్రజల్లో కలిగింది..మాది గల్లీ పార్టీ కాదు అని ఒకరంటే..మాది పక్కగల్లీ పార్టే, ఎవరు కావాలో నగరవాసులే నిర్ణయించుకోవాలి మరోకరు అంటూ ప్రచారంలో దూసుకెళ్ళారు..లోకల్‌ పార్టీ, ఢిల్లీ పార్టీ మధ్య ఎన్నికలంటూ ప్రచారం చేసుకున్నాయి పార్టీలు..అయితే భాగ్యనగరంలో బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొడంపై ఇప్పుడు నగర ప్రజల్లో చర్చ జరుగుతుంది. హైదరాబాద్‌లో బీజేపీ అగ్ర నేతలు అమిత్‌ షా, నడ్డా, ఫడ్నావిస్, తేజస్వీ సూర్య, స్మృతి ఇరానీ వంటి నేతలు ప్రచారం చేయడం ఎవరికి, ఏ పార్టీకి ప్రయోజనం జరుగుతుందనే చర్చ మేధావి వర్గంలో జరుగుతుంది..మొదట్లో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా సాగిన ప్రచారం చివరి వరకూ వచ్చే సరికి బీజేపీ వర్సెస్‌ ఎంఐఎం మధ్య ఎన్నికలుగా మారింది..దుబ్బాకలో గెలిచి ఊపు మీద ఉన్న కమలం పార్టీ గ్రేటర్‌ పీఠంపై కన్నేసింది..ఎట్టి పరిస్థితిలోనైనా గెలవాలనే పట్టుదలతో ప్రచారం నిర్వహించింది..కాని ప్రచారం ఎన్నికలు, హైదరాబాద్‌ అభివృద్దిపై కాకుండా సర్జికల్ స్ట్రైక్‌, రోహింగ్యాలు, పాక్, బంగ్లాదేశ్‌, సమాధుల తొలగింపు వంటి అంశాలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి..ఈ అంశాలపైనే బీజేపీ-ఎంఐఎంలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి..మేయర్‌ పీఠం చేజిక్కుంచుకొనే అవకాశాలు రెండు పార్టీలకు తక్కువే..అయిన ఎందుకు ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై గ్రేటర్‌ వాసుల్లో గుసగులసు వినిపిస్తున్నాయి..రెండు పార్టీల మధ్య లోపాయికార ఒప్పందాలేవో జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..జాతీయ స్థాయిలో బలపడాలనే ఎంఐఎంకు బీజేపీ పరోక్షంగా సహకరిస్తుందిని అంటున్నారు నగర ప్రజలు..నగరంలో ఓటర్లను మతాలుగా విభజించే ప్రయత్నం ఎంఐఎంకు బీజేపీ నేతల ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు..దీంతో సెక్యులర్‌ ఓటర్లతో కేసీఆర్‌కు మరింత మద్దతు పెరుగుతుంది.
అయితే ఇదే అంశాన్ని మేధావి వర్గం మరో రకంగా విశ్లేషిస్తున్నారు..పాత బస్తీలో బీజేపీ అగ్ర నేతలు, మంత్రులు ప్రచారం చేయడం వల్ల టీఆర్‌ఎస్‌కే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందంటున్నారు..బండి సంజయ్‌, అమిత్‌ షా చార్మినర్‌లో భాగ్యలక్ష్మీ టెంపులు విజిట్ చేయడంలో ఎంఐఎం,బీజేపీ పార్టీలు తమ ఓటు శాతాన్ని స్థిరపరుకునే ఉద్దేశ్యం అందులో కనిపిస్తుందంటున్నారు..బీజేపీ హిందూవుల ఓట్లు, ఎంఐఎం ముస్లీంల ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇది రాజకీయ ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు..

 

గ్రేటర్‌లో బీజేపీ నేతలు చేసిన ప్రసంగాలతో టీఆర్ఎస్‌ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై మరింత నమ్మకం కలిగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు..కేటీఆర్‌ సమయస్ఫూర్తిని మరింత దృఢపరస్తుందని..బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు వేధావి వర్గం..
గ్రేటర్ హైదరాబాద్‌ అనేది ఒక మతం, జాతికి పరిమితమైందికాదు..ఇక్కడ అన్ని రకాల ప్రజలు,వర్గాల వారు నివసిస్తున్నారు..హైదరాబాద్‌ అనేది ఒక అంతర్జాతీయ కేంద్రం చాలా దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు..అనేక అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి..గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు చేసిన ప్రసంగాలు వీరందరిపై ఉంటుంది..అంతర్జాతీయ సంస్థలకు శాంతి భద్రతలు చాలా ముఖ్యం..తమ విధులు నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాలు,భద్రతా విషయంలో ప్రభుత్వం సహకారం కొరుకుంటాయి..టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఈ అంశాలలో మిగతా రాష్ట్రాలు,గత ప్రభుత్వాల కంటే ముందు ఉందని.. ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని తీరు ముఖ్యంగా కేసీఆర్‌ పాలనదక్షతను మరింత పెంచనుంది అంటున్నారు ఐటీ ఎక్స్‌ఫర్ట్..

Read more RELATED
Recommended to you

Latest news