దత్తపుత్రుడు అలియాస్ బెత్తం నాయుడు: విజయసాయిరెడ్డి సెటైర్లు

-

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కాస్త వైరైటీగా సెటైర్లు పేల్చారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నుంచి పవన్ ప్యాకేజీ తీసుకుంటారని, చంద్రబాబుకు గాయమైతే పవన్ అరుస్తారని ఆయన చురకలంటించారు.

‘దత్తపుత్రుడు అలియాస్ బెత్తం నాయుడి రియాక్షన్ ను ఎప్పటిలాగే సోషల్ మీడియా ముందుగానే ఊహించింది. చంద్రబాబుకు గాయమైతే ఆయన కంటే ముందే ఈయన అమ్మా అని అరుస్తాడు. నిమిషాల వ్యవధిలోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ప్యాకేజి తీసుకున్నవాడి బాధ్యత కదా!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ట‌ర్‌లో పేర్కొన్నారు. మ‌రి దీనికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news