మా ఎమ్మెల్యే మమల్ని మోసం చేసారు:వైసీపీ కార్యకర్తలు

-

మరో వివాదంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చిక్కుకున్నారు. వైసీపీ కార్యకర్తలు ఆమె పై ఎదురు తిరిగారు. ఎన్నికల సమయంలో తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని వైసిపి నేత మేకల రవి సెల్ఫీ వీడియో చేసాడు. ఉండవల్లి శ్రీదేవి తన భర్త మోసం చేశాడని ఎన్నికల సమయంలో నా వద్ద కోటి 40 లక్షలు తీసుకుంది అని పలు దఫాలుగా 40 లక్షలు తిరిగి ఇచ్చింది అని మిగతా 80 లక్షలు అడిగితే బెదిరిస్తుందని కన్నీరు పెట్టుకున్నాడు రవి.

80 లక్షల అడిగితే డిసిఎంఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు సరిపెట్టుకోవాలని సమాదానం ఇచ్చింది అని డబ్బు కోసం ఇంటికి వెళ్లితే గేట్ అవుట్ అంటూ దుర్బాషలాడిందిఅని ఆవేదన వ్యక్తం చేసాడు. ఎస్పీకి ఫోన్ చేసి లోపల వేయిస్తానంటూ బెదిరించింది అని… ఉండవల్లి శ్రీదేవి చర్యలతో తాడికొండ లో వైసిపి కార్యకర్తలు ఆత్మహత్య లు చేసుకునే పరిస్దితులు వచ్చాయి అని సీఎం జగన్ స్పందించకపోతే రాజధాని తొలి మరణం తనదే అవుతుందని కన్నీరు పెట్టుకున్నాడు. తాడికొండ లో ఎమ్మెల్యే శ్రీదేవి అరాచకాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ కి సెల్ఫీ వీడియో ద్వారా తెలియచేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news