సిగ్గున్నవారు ఎవరు బిజెపిలో ఉండరు – పొన్నం ప్రభాకర్

-

బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతోనే తెలంగాణ ఏర్పడిందని.. పార్లమెంట్ ప్రొసీజర్ ఎలా నడుస్తుందో తెలియని ప్రధాని తెలంగాణ బిల్లును తలుపులు మూసి బిల్లు ఆమోదించారని అవమానించారని మండిపడ్డారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పిన తరువాత తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పామన్నారు.

సిగ్గున్నవారు ఎవరు బీజేపీ లో ఉండరని.. వారు తెలంగాణ డీఎన్ఏ నా అని పరీక్ష చేసుకోవాలన్నారు పొన్నం ప్రభాకర్. ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం.. అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రామగుండం మాత్రమే కాదు ఇంకా 4 ఫ్యాక్టరీ లు అప్పటి ప్రభుత్వం పునప్రారంభం కి 18400 కోట్లు కేటాయించిందన్నారు. ఇది బీజేపీ అజ్ఞానులకు తెలియదా..? అని ప్రశ్నించారు. దేశంలో యూరియా ,డీఎపి లు దిగుమతి చేసుకునే అవసరం ఉందన్నారు. ఆరోజు లక్ష కోట్ల సబ్సిడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని.. 8 సంవత్సరాలు గా ఈ దేశంలో ఒక్క ఎరువుల ఫ్యాక్టరీ అయిన ఏర్పాటు చేసారా…? అని ప్రశ్నించారు. పేదలను దోచుకునే వారిని వదలం అంటున్న ప్రధాని ఈ దేశంలో పేదలను దోచుకుంటున్నది మీరు కాదా..? అని దుయ్యబట్టారు.

దేశంలో మికన్న పెద్ద దోపిడీ దారు ఎవరైనా ఉన్నారా..? అంటూ విమర్శించారు. ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను తిట్టడం వల్ల న్యూట్రిషన్ పెరుగుతుంది కానీ.. మీరంటున్నటు తిట్ల వల్ల కాదన్నారు. పోర్టులు, ఎయిర్పోర్ట్ లు ప్రభుత్వ రంగ సంస్థలు అంబాని, ఆధానిలకు అమ్మడం లేదా..? అని మండిపడ్డారు. కాళేశ్వరం కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎం అన్నారు.. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news