మోడీ పర్యటనతో ఒరిగిందేమీ లేదు – బాల్క సుమన్

-

మోదీ పర్యటనతో ఒరిగింది ఏమి లేదన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. మోడీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని మండిపడ్డారు. గుజరాత్ లో ఎన్నికలు ఉన్నందుకు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. గడియారాలు తయారు చేసే కంపెనీకి బిర్జ్ పనులు అప్పచెప్పి వందల మంది చావులకు కరమైనవు మోడీ, బిజెపి ప్రభుత్వం వందల కోట్ల అవినీతి పాల్పడుతోందని ఆరోపించారు. లాభాలలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను మీ మిత్రులు అదాని, అంబానిలకు మోడీ అమ్ముతున్నారని అన్నారు.

మోడీ పచ్చి అబద్ధాలు చెప్పారని అన్నారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను ప్రవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సింగరేణి కార్మికులకు ఇన్ కాం టాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ బడా జుట పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణ లోని ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోద ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణకు రావలసిన జిఎస్టి డబ్బులు ఇవ్వకుండా అపుతున్నది నువ్వు కదా మోడీ’ అంటూ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వన్ని కూల్చడానికి కుట్రలు చేసింది మీరు కదా? అని ప్రశ్నించారు బాల్క సుమన్.

Read more RELATED
Recommended to you

Latest news