ఆ విషయంలో రాజీ పడుతున్న పూజా హెగ్డే.. సక్సెస్ అవుతుందా..?

-

అందం, అభినయం కలగలిసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు రంగస్థలం వంటి సినిమాల నుంచి ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ కుర్ర కారును కూడా అలరిస్తోంది.. సాధారణంగా సినిమా అనేది ఒక లాటరీ లాంటిది. ఏది హిట్ అవుతుందో ఏది ఫట్ అవుతుందో కూడా చెప్పడం కష్టం.. ఒక సినిమా హిట్ అయితే హీరో రెమ్యునరేషన్ పెంచేస్తారు. కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం రెమ్యునరేషన్ తగ్గించారు. అందుకు కారణం వారి స్టార్డం అని చెప్పాలి..

అయితే హీరోయిన్స్ కు మాత్రం రెమ్యునరేషన్ విషయంలో బాగా తేడా ఉంటుంది. ఎందుకంటే వరుసగా ప్లాపులు వస్తే మాత్రం హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఇదే పరిస్థితిని పూజా హెగ్డే కూడా ఎదుర్కొంటుంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు మూడు సినిమాలు డిజాస్టర్ గా మిగలడంతో గోల్డెన్ లెగ్గు కూడా ఐరన్ లెగ్గుగా మారిపోయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మాత్రమే ఈమె నటిస్తోంది.మరోపక్క హిందీలో సల్మాన్ ఖాన్ సరసన కిసీకా భాయ్ కిసిక జాన్ అనే సినిమాలో నటిస్తోంది.

ఈ రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి ఇకపోతే వీటి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈలోపు ఈమె కొత్త సినిమాలను లైన్లో పెట్టడానికి తెగ కష్టపడుతున్నట్లు సమాచారం ఇకపోతే పూజ హెగ్డే కి కొత్త అవకాశాలు రావాలి అంటే ఒక కండిషన్ కి ఒప్పుకోవాలని నిర్మాతలు చెప్పుకొస్తున్నారట. వరుస ప్లాప్ లతో ఉండడంతో ఆఫర్లు కూడా రావట్లేదు అవి కావాలి అంటే రెమ్యునరేషన్ లో రూ. 50 లక్షలు తగ్గించుకోవాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి రాజీ పడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news