పూజా హెగ్డే ఇంట పెళ్లి బాజాలు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన బుట్ట బొమ్మ..!

-

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె టాలీవుడ్ హీరోలు అందరి సరసన నటించి తన కెరీర్ గ్రాఫ్ ను అమాంతం పెంచుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోవర్స్ ను కలిగి ఉంది. అందుకే పూజా హెగ్డే కు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.

అందులో భాగంగానే పూజా హెగ్డే ఇటీవల ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయగా అది కాస్త బాగా వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఇటీవల ఆమె ఇంట పెళ్లి బాజాలు మోగాయి. పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే వివాహం వైభవంగా జరిగింది. శివాని శెట్టి అనే అమ్మాయి ను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ వేడుక ఫోటోలను పంచుకుంది పూజా..” నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు . ఈ వేడుక ప్రారంభం నుంచి నేనెప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను.. చిన్నపిల్లలా నవ్వేసా.. ఆనంద భాష్పాలు వచ్చాయి “అంటూ ఎమోషనల్ గా పోస్ట్ షేర్ చేసింది.

అంతే కాదు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది సినీ తారలు అభిమానులు కూడా ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పూజా హెగ్డే నూతన దంపతులతో కలిసి దిగిన ఫోటోలను అలాగే తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఇవి కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Read more RELATED
Recommended to you

Latest news