ఏపీ ప్రభుత్వానికి పూనమ్ కౌర్ రిక్వెస్ట్..!

-

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సామాజిక రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉంటారు. తాజాగా పూనమ్ కౌర్ జేడి లక్ష్మినారాయణ చేసిన ఓ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. జేడీ తుఫాను ప్రభావిత ప్రజలకి ముఖ్యంగా రైతులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు పెండింగ్ లో ఉన్న చెల్లింపులను విడుదల దెబ్బ తిన్న పంటలకు కూడా నష్ట పరిహారం అందించాలని జేడీ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక పూనమ్ ఈ ట్వీట్ ను రిట్విట్ చేయడం తో ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఇదిలా ఉండగా టాలీవుడ్ పూనమ్ కౌర్ పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. అయితే అందం తో పాటు ఎంతో టాలెంట్ ఉన్న పూనమ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతుందని అంతా భావించారు. కానీ పూనమ్ కౌర్ సినిమాల్లో పెద్దగా రానించలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news