టీఆర్ఎస్ ఓటమి తప్పదు… పోటీ చేసేది నేనే..

-

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదు.. బీజేపీ నుంచి పోటీచేసేది నేనే అని క్లారిటీ ఇచ్చారు ఈటెల రాజేందర్. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఎట్టి పరిస్థతిలో గెలవదని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో డబ్బులు పంచేందుకే హరీష్ రావు వచ్చారని విమర్శించారు. ఇన్నాళ్లు హుజూరాబాద్ లో పలు పార్టీలు ప్రచారం చేసినా కేవలం టీఆర్ఎస్ మాత్రమే తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించారు. మిగతా ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించ లేదు. తాజా ఈటెల వ్యాఖ్యలతో బీజేపీ నుంచి ఆయనే పోటీ చేస్తారని తెలిసిపోయింది. కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరిని బైపోల్ బరిలో దింపుతారనేదానికి స్పష్టత రాలేదు. ప్రముఖంగా కొండా సురేఖ పేరు వినిపిస్తోంది. కాగా ఉప ఎన్నికల నామినేషన్లు అక్టోబర్ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అభ్యర్థులు తేలితే రాజకీయం రసవత్తరంగా ఉండబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news