తిరుమలలో భేటీ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

-

ఇటీవల మంత్రి మల్లారెడ్డి పై నిరసన గలం వినిపించిన ఎమ్మెల్యేలు తిరుమలలో మరోసారి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బండ ప్రకాష్ గౌడ్ తిరుమల వెళ్లారు. వీరంతా హైదరాబాద్ నుంచి కలిసే వెళ్లినట్లు తెలుస్తోంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకుని అక్కడే భేటీ అయినట్లు సమాచారం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి పై అసమ్మతితోనే ఎమ్మెల్యేలు ఈ సమావేశం నిర్వహించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల కాలంలో మల్లారెడ్డి ప్రవర్తనతో ఆయనతో కొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు విభేదిస్తున్నారు. వీరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news