టిఆర్ఎస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేస్తాం – కేంద్ర మంత్రి

-

టిఆర్ఎస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద జోషి. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద జోషి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పూర్ణకుంభం తో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. వేద ఆశీర్వాదం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు అధికారులు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని కార్యక్రమాలను మొదలు పెడుతున్నానని.. తెలంగాణలో గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉంది… ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని మర్చిపోయారని పేర్కొన్నారు. కేటీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యుల పై తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయిందని… తెలంగాణలో బిజెపి పార్టీ పని చేసుకోవడానికి తగిన శక్తిని ప్రసాదించమని స్వామివారిని కోరుకున్నానని వెల్లడించారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేసి… తెలంగాణ ప్రజలు బిజెపిని అధికారంలోకి తెచ్చి మోడీ నేతృత్వంలో తెలంగాణ లో బిజెపి సర్కార్ రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news