సారీ చెబితే.. సరిపోదు సారు : ప్రధానిపై ప్రకాష్ రాజ్ సెటైర్

-

వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకుంటున్నట్లు శుక్ర వారం రోజున రద్దు చేస్తునట్లు… దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా రైతులు ఈ ఏడాది కాలంగా.. ఉద్యమం చేస్తున్నారని… ఈ నేపథ్యంలోనే తాను రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు… క్షమాపణలు చెప్పారు నరేంద్ర మోడీ.

ఇకనైనా రైతులు.. ధర్నాలు ఆపేయాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే… దేశ ప్రధాని మోడీ ప్రకటనపై ప్రముఖులు కూడా స్పందించారు. ఇది రైతులు సాధించిన విజయమంటూ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే… విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా స్పందించారు. ” ప్రియ మైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారు.. రైతుల కు చెప్పిన క్షమాపణ లు సరిపోవు. రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తారా ? ” అంటూ ప్రశాష్‌ రాజ్‌ ఫైర్‌ అయ్యారు. అంతేకాదు…..కేటీఆర్‌ ట్వీట్‌ ను ట్యాగ్‌ చేశారు ప్రకాష్‌ రాజ్.

Read more RELATED
Recommended to you

Latest news