నేడు విశాఖకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

-

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేడు విశాఖకు రానున్నారు. ఐఎన్ఎస్ డే వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రానున్నారు. ప్రెసిడెంట్ ఫ్లీట్, మిలన్ 2022 కోెసం విస్తృతమైన ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ రోజు సాయంత్రం నగరానికి చేరుకోనున్నారు రాష్ట్రపతి. నేవీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ “ఐ ఎన్ఎస్ డే గా”కు 5గంటలకు చేరుకోనున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్… రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి విశాఖకు రానున్నారు. దీంతో నగరం మొత్తం భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఫీఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ మంత్రి రామ్ నాథ్ కోవింద్ కూడా విశాఖ రానున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు కూడా పాల్గొననున్నారు. సిటీ సెక్యురిటీ, ట్రాఫిక్ కోసం 3 వేల మంది పోలీసులను ప్రభుత్వం భద్రత కోసం ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈ కార్యక్రమం కోసం విశాఖకు పంపారు. ట్రాఫిక్, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా… జాగ్రత్తలు తీసుకోనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news