తెలంగాణకు మరో కొత్త ప్రాజెక్టు..ప్రధాని మోడీ ట్వీట్

-

తెలంగాణకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పారు. తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రైల్వే లైన్ల విద్యుదీకరణలో భాగంగా పర్లి వైజనాథ్-వికారాబాద్ మార్గంలో విద్యుదీకరణ చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ చేసిన ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేశారు.

ఈ సందర్భంగా దీనివల్ల ప్రయోజనం పొందే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రజలకు అభినందనలు అంటూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. మిషన్ విద్యుద్దీకరణలో భాగంగా ఈ ప్రత్యేక విస్తరణ ద్వారా మూడు రాష్ట్రాలకు ప్రయోజనం జరుగుతుందని మోదీ తెలిపారు. పర్లి వైద్యనాథ్-వికారాబాద్ మార్గంలో విద్యుదీకరణ ప్రాజెక్టును రైల్వే శాఖ ప్రకటించింది. లాతూర్ రోడ్-పర్లి వైద్యనాథ్ మార్గంలో 268 కి.మీ మార్గం మొత్తం ఇప్పుడు విద్యుదీకరించబడుతుందని రైల్వే శాఖ ట్విట్టర్ లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news