మీకు జాబ్ ఇచ్చే ఉద్దేశం బీజేపీకి లేదు : ప్రియాంకా గాంధీ

-

హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకర్షంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శల జోరు పెరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ హిమాచల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

మండి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ప్రచార సభలో ప్రియాంకా గాంధీ ప్రసంగించారు. మండి జిల్లా ప్రజల కోసం హిమాచల్‌ ముఖ్యమంత్రి ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లాలో 63 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా బీజేపీ వాటిని భర్తీ చేయలేదని ఆరోపించారు ఉద్యోగ ఖాళీలు ఉన్నా బీజేపీ ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేకనే బీజేపీ సర్కారు ఖాళీలను భర్తీ చేయడం లేదని విమర్శించారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news