‘కెప్టెన్ మిల్లర్’తో ప్రియాంక మోహన్ రొమాన్స్ !

-

2002లో కెరీర్‌ మొదలు పెట్టిన ధనుష్ ఈ 20ఏళ్లలో అంచెలంచెలుగా ఎదిగి హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ధనుష్‌ నటించిన చిత్రాలేవీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేదు. ‘కర్ణన్‌’ ఒక్కటే మెప్పించింది.

‘పటాస్‌’, ‘ది గ్రేమ్యాన్’, ‘జగమేతంత్రం’ పెద్దగా మెప్పించలేదు. ఇక హీరో ధనుష్‌ ప్రస్తుతం చేస్తున్న మూవీ కెప్టెన్‌ మిల్లర్‌. ఇప్పటికే రిలీజ్‌ అయిన ప్రీ లుక్‌ పోస్టర్‌ ల అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీలో టాలీవుడ్‌ యువ నటుడు సందీప్‌ కిష్‌ ఓ కీ రోల్‌ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ గా యువ నటి ప్రియాంక మోహన్‌ ను తీసుకున్నారు. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడమే కాకుండా.. ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేసింది. కాగా సరైన హిట్‌ లేకపోయినా.. వరుస ఆఫర్స్‌ కొట్టేస్తోంది. డెబ్యూ మూవీ పెద్దగా ఆడకపోయినా.. పక్కింటి అమ్మాయిలా కనిపించి ఇంప్రెస్‌ చేసేసింది. ఇప్పటివరకు యంగ్‌ హీరోలతో నటించిన ఈ అమ్మడిపై స్టార్స్ దృష్టి పడింది.

Read more RELATED
Recommended to you

Latest news