చౌటుప్పల్‌లో రాజగోపాల్‌ రెడ్డి సతీమణికి నిరసన సెగ

-

మునుగోడు ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా నియోజకవర్గంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డికి పలుచోట్ల  అడుగడుగున నిరసన సెగ తగులుతోంది. ప్రచార నిమిత్తం నియోజకవర్గంలో తిరుగుతున్న ఆయనకు చోట్ల నిలదీతలు, అడ్డుకోవడాలు సర్వ సాధారణంగా మారిన విషయం తెలిసిందే.

తాజాగా ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి కూడా నిరసన ఎదురైంది. మాజీ మంత్రి డీకే అరుణతో కలిసి కోమటిరెడ్డి సతీమణి చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు లక్ష్మిని అడ్డుకున్నారు. లక్ష్మి గో బ్యాక్.. బీజేపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

గత ఎన్నికల సందర్భంగా గ్రామాభివృద్ధికి ఇచ్చిన మాటను విస్మరించారని నిలదీశారు. బీజేపీ నేత డీకే అరుణపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేంలేక వారు తమ ప్రచారాన్ని ముగించుకుని అక్కడినుంచి వెనుతిరిగారు. పోలీసులు జోక్యంచేసుకుని పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news