నేడు సిద్ధిపేట జిల్లాలో పంజాబ్ సీఎం పర్యటన

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించనున్నారు. కేసీఆర్​తో పాటు పంజాబ్​ సీఎం భగవంత్ సింగ్ మాన్​ కూడా సిద్దిపేటలో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా కొండపోచమ్మ రిజర్వాయర్, మర్కుక్ పంప్ హౌస్, పాండవుల చెరువును పరిశీలించనున్నారు పంజాబ్‌ సీఎం భగవంత్ సింగ్ మాన్, పంజాబ్ రాష్ట్ర అధికారులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్నారు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news