ఎర్రబెల్లికి ABCDలు రావు..వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – రేవంత్‌

-

ఎర్రబెల్లి ఓ కోవర్టు..తెలంగాణలో TDP లేకుండా చేశాడని టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో నిర్వహించిన సభలో టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడారు. పాలకుర్తి కి గొప్ప చరిత్ర ఉంది…భాగవతం రాసిన బొమ్మరా పోతన ది,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ,దొడ్డి కొమురయ్యాలది ఈ పాలకుర్తి గడ్డ అన్నారు. ఓనమాలు, అబీసీడ్ లు రాయరానోడు ఎమ్మెల్యే గా,మంత్రి అయ్యిండు…ఈ పాలకుర్తి గడ్డ మీద సవాల్ చేస్తున్న…దయాకర్ రావు ఓనమాలు,ఏబీసీడీలు రాస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్‌ చేశారు రేవంత్‌.

Revanth-Reddy writes a letter tp pm modi regarding the situation in hyderabad

తెలుగుదేశం లో ఉండి టిఆర్ఎస్ తో కోవర్ట్ అయ్యి తెలుగు దేశం పార్టీకి వెన్నుపోటు పొడిచాడు…ఈరోజు తెలంగాణ గడ్డ మీద తెలుగు దేశం పార్టీ లేకుండా చేసాడని నిప్పులు చెరిగారు. ఎర్రబెల్లి దయాకర్ ధరణిని అడ్డుపెట్టుకొని భూములను ఆక్రమించుకుంటు న్నాడని…. రాజకీయ బిక్షపెట్టిన తెలుగుదేశం పార్టీని కోవర్ట్ ఆపరేషన్ చేసి తెలుగుదేశాన్ని కథం చేసాడన్నారు. దయాకర్ ను నమ్మితే కేసీఆర్ కిడ్నీ కూడా అమ్ముకుంటాడు. పాలకుర్తి లో రాజీవ్ విగ్రహాన్ని తీయాలని కుట్ర జరుగుతుంది,రాజీవ్ విగ్రహన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news