BREAKING : పంజాబ్‌ కెప్టెన్‌ గా మయాంక్‌ నియామకం

-

పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ – 2022 కొత్త కెప్టెన్‌ ను నియామకం చేసింది ఆ జట్టు యాజమాన్యం. ఆ జట్టు స్టార్‌ ప్లేయర్‌, ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ను కెప్టెన్‌ గా నియామకం చేస్తూ.. పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసింది.

ఈ విషయాన్ని తమ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేసింది పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం.ఇక పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే..మయాంక్​ అగర్వాల్​పై నియామకం మాట్లాడారు. “మయాంక్ 2018 నుండి జట్టులో ఉన్నాడు. తమ కొత్త జట్టు అద్భుతమైన యువ ప్రతిభను, అత్యుత్తమ అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కలిగి ఉంది. మయాంక్ నాయకత్వంలో మేము భవిష్యత్తు కోసం బలమైన పునాదిని సృష్టించాలనుకుంటున్నాము. అతను కష్టపడి పనిచేసేవాడు, ఉత్సాహవంతుడు, నాయకుడికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్న ఆటగాడు. అతనితో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. కెప్టెన్‌గా అతను జట్టును విజయం వైపు నడిపిస్తాడని నమ్ముతున్నాను.” అంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news