పూరీ.. విజయ్ దేవరకొండ ను కూడా మోసం చేశారా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలయ్యాయి. అంతేకాకుండా ఎంతోమంది హీరోలకు పూరీ జగన్నాథ్ లైఫ్ ఇచ్చారని వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రాలన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా తన కెరీర్ ని మలుపు తిప్పుకున్నారు పూరీ. దీంతో మళ్లీ విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా లెవెల్ లోకి లైగర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం భారీ డిజాస్టర్ ని చవిచూసింది.

ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించారు. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి పలు వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు చాలా నష్టపోయామని తమకు ఎంతో కొంత చెల్లిస్తే బాగుంటుందని దర్శకుడు, నిర్మాత పూరీ, ఛార్మీ ని అడగడం జరిగింది. కానీ వారు ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదు. దీంతో పూరీ ఇంటికి వెళ్లడం పూరీ వాళ్ళ మీద కేసు పెట్టడం వంటివి జరిగాయి.. అయితే ఈ సినిమాకు సంబంధించి పూరీ మరియు ఛార్మీ నిర్మాతలుగా లాభాలను తప్పితే నష్టాలను చవి చూడలేదని వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి

ముఖ్యంగా ఈ సినిమా ఓటీటి మరియు శాటిలైట్స్ రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉంటే పూరీ విజయ్ దేవరకొండకు కూడా ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమధ్య రెండు సార్లు విజయ్ దేవరకొండ ముంబైకి వెళ్లి పూరీని, ఛార్మిని కలవగా తాము నష్టాలలో ఉన్నామని తనకు రెమ్యూనరేషన్ ఇవ్వలేమని చెప్పినట్లుగా సమాచారం. దీంతో విజయ్ ను కూడా మోసం చేశారని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news