సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు… కేవలం నాన్సెన్స్ : ఆదిమూలపు సురేష్

-

వాలంటీర్‌ల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా టీడీపీ మద్దతు మీడియా కథనాలు రాయటం దురదృష్టకరమన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహార శైలి కుట్రపూరితమని, సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు… కేవలం నాన్సెన్స్ అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలను వివక్ష లేకుండా, పారదర్శకంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిందే వాలంటీర్ వ్యవస్థ అని, ప్రస్తుతం 2 లక్షల 65 వేల మంది వాలంటీర్లు రాష్ట్రంలో ఉన్నారన్నారు. ఖాళీలు ఏర్పడిన వెంటనే ప్రతి 15 రోజులకు ఒకసారి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 4,600 ఖాళీలు ఉన్నాయి.

Adimulapu Suresh clarifies on schools reopening, says no need to worry  about students health

చంద్రబాబు తన హయాంలో అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన విషయాన్ని ఎవరూ మరిచిపోలేదన్నారు. జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇస్తే అవ్వా తాతలకు పెన్షన్ దొరికేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 20 వేల మంది గృహ సారధులు పార్టీ కోసం పని చేయనున్నారని, మరో 46 వేల మంది కన్వీనర్లు వస్తున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవాల్సిన అవసరం మాకు లేదని, వచ్చే ఎన్నికల్లో 175 కి 175 గెలవడం మా టార్గెట్ చేశారన్నారు. చంద్రబాబు ఐటీకి తానే పేటెంట్ అని చెబితే ప్రజలు నవ్వుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయం కోసం చంద్రబాబు సమాజంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news