సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కి పువ్వాడ అజయ్ లేఖ

-

ఖమ్మం జిల్లా మెడికల్ కలశాలకై లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను విడుదల చేసింది నేషనల్ మెడికల్ కమిషన్. దీంతో ఈ విద్యా సంవత్సరం నుండే కళాశాల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఅర్ మంత్రి హరీష్ రావు కి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

“ఖమ్మం జిల్లా కు మెడికల్ కలశాల ఎర్పాటుతో జిల్లా ప్రజల కల సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి నా కృతజ్ఞతలు. ఈ విద్యా సంవత్సరం 2023-24 నుండే ప్రభుత్వ మెడికల్ కళాశాల తరగతులను నిర్వహించేందుకు 100 సీట్లతో నేషనల్ మెడికల్ కమిషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను విడుదల చేసింది. దీనికి అంగీకారం తెలుపుతు వారం రోజుల లోపల పూర్తిస్థాయిలో అన్ని అనుమతులతో ఖమ్మం మెడికల్ కళాశాల ప్రారంభం కానుంది. ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం కానున్న సందర్భంగా వైద్య విద్యార్థులకు, ప్రజలకు నా శుభాకాంక్షలు” అని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news