జగన్‌కు రఘురామ మరో లేఖ

-

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే పలు సమస్యలపై జగన్‌కు చాలాసార్లు లేఖలు రాశారు. ఇప్పుడు తాజాగా మరోసారి లేఖ సంధించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్, ఏపీ‌హెచ్ఎంహెచ్ఐడీసీలకు అధిపతులుగా తగిన అనుభవంలేని ఇద్దరు తెలంగాణ వైద్యులను నియమించారని లేఖలో రఘురామ పేర్కొన్నారు. వైద్య సంబంధిత సంస్థలకు అధిపతులుగా పక్క రాష్ట్రాల వైద్యులను కాకుండా ఏపీ పరిస్థితులు తెలిసిన స్థానిక వైద్యులను నియమించాలని సూచించారు. కనీసం మంచి వైద్యులైనా ఇక్కడ ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.

ఇప్పటికే ప్రభుత్వ ఏక పక్ష నిర్ణయాలపైనా రఘురామ కృష్ణంరాజు లేఖలు ద్వారా జగన్ కు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల అభిప్రాయాలకనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలుగు అకాడమీ పేరు మార్చడంపై కూడా ఆయన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ లేఖతోనైనా సీఎం జగన్ స్పందిస్తారేమో చూాడాలి.

Read more RELATED
Recommended to you

Latest news