ఏపీలో రావణ రాజ్యం నడుస్తోంది – రఘురామ

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. శ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ట్విట్ చూస్తే నవ్వు వచ్చిందని, సుపరిపాలన అంటే రామరాజ్యం అని తానేదో శ్రీరాముని అడుగుజాడల్లో నడుస్తున్నట్లుగా ట్విట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, రాష్ట్రంలో రావణ రాజ్యం నడుస్తోందని, రావణాసురుడు పుష్పక విమానం వేసుకొని తిరిగినట్టుగా, ప్రజా సంపదను కోటానుకోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ప్రత్యేక విమానాలలో తిరుగుతున్నారని అన్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి అపాయింట్మెంట్ కోసం రాత్రి 11 గంటల వరకు వేచి చూసిన జగన్ మోహన్ రెడ్డి గారు ఇక చేసేదేమీ లేక తిరుగు ప్రయాణానికి విమాన ఎక్కే సమయంలో, హోం మంత్రి అమిత్ షా గారి నుంచి పిలుపు వచ్చిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రులు ఎవరైనా ప్రధానమంత్రి గారిని లేదంటే సంబంధిత శాఖల మంత్రులను కలుస్తారు, అంతేకానీ అర్ధరాత్రి కావొస్తున్న సమయంలో కేసుల మాఫీ కోసం అయితేనే హోం శాఖామంత్రి గారిని కలుస్తారని, హోం శాఖ మంత్రి అమిత్ షా గారితో భేటీ అనంతరం ముఖ్యమంత్రి గారి ముఖచిత్రం మాడిపోయిన దోసలా మారిపోయిందని చూసినవారు చెబుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news