చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది.. గవర్నర్‌కు రఘురామ లేఖ

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉందని వార్తలు షికారు చేస్తున్న నేపథ్యంలో.. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాయడం జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్నారు. ఈ జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీ రఘురామ గవర్నర్‌కు లేఖ రాశారు. మెరుగైన వైద్యం కోసం చంద్రబాబును వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని లేఖలో పేర్కొన్నారు.

Raghu Ramakrishna Raju Says He Is Unfit For Politics

డీహైడ్రేషన్‌, అలర్జీ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నారని.. ఐదు కిలోల బరువు తగ్గారని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మరింత బరువు తగ్గితే కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి వస్తుందన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. హానికరమైన స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నాయన్నారు. ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించాలని గవర్నర్‌ను కోరారు. చంద్రబాబుకు వెంటనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news