మణిపూర్ గురించి రెండు నిముషాలే ? కానీ మా గురించి మాత్రమే రెండు గంటలు : రాహుల్ గాంధీ

-

పార్లమెంట్ సమావేశాలలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరును కాంగ్రెస్ కేరళ ఎంపీ రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎండగట్టారు. రాహుల్ గాంధీ కేరళ లోని వాయనాడ్ లో మాట్లాడుతూ … పార్లమెంట్ లో ప్రధాని మోదీ రెండు గంటల పాటు సంభాషించి.. అందులో మణిపూర్ అంశం పైన కేవలం రెండు నిముషాలు మాత్రమే కేటాయించారు అన్న విషయాన్ని లేవనెత్తారు, దేశ ప్రజల గురించి ఆలోచించే మోదీకి మణిపూర్ లో దేశాన్ని కుదిపేసే ఘటనలపై మాట్లాడడానికి రెండు నిముషాలు మాత్రమే దొరికాయా అంటూ విమర్శించారు రాహుల్ గాంధీ. అదే మా కూటమి INDIA గురించి, కాంగ్రెస్ గురించి మరియు నా గురించి రెండు గంటల పాటు మాట్లాడారు అంటూ మోదీపై ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ.

INDIA అంటేనే శాంతి, హింస ద్వేషం అంటే భారత్ కాదు అంటూ మోడీకి తెలిసేలా రాహుల్ చెప్పారు. ఇక మోఢీ ప్రభుత్వంపై ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం నిన్ననే వీగిపోయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news