నేడు కేరళకు రాహుల్..మూడు రోజులు అక్కడే పర్యటన.

-

నేటి నుంచి మూడు రోజుల పాటు కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ పర్యటించనున్నారు.తొమ్మిది నెలల విరామం తరువాత వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు తన సొంత నియోజకవర్గాన్ని సందర్శిస్తారు..జనవరిలో చివరిసారిగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ నేటి నుంచి మూడు రోజుల పాటు వయనాడ్‌లోనే మకాం వేయనున్నారు..
గత కొంత కాలంగా రాహుల్ తన నియోజకవర్గాన్ని సందర్శించడంలో విఫలమయ్యారు..కోవిడ్ రాహుల్ ప్రణాళికలను దెబ్బతీసింది..విమానాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ ఆయా లోక్సభ స్థానాలను సందర్శిస్తున్నారు..అక్టోబర్ 15 న ముందేరీ వొకేషనల్ హెచ్‌ఎస్‌ఎస్ కొత్త భవనాన్ని రాహుల్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, ఈ ప్రతిపాదనను అధికారులు ముందుగా సమర్పించడంలో విఫలమైనందుకు జిల్లా కలెక్టర్ అదీలా అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆన్‌లైన్ ఈవెంట్ నుండి రాహుల్ గాంధీ వైదొలిగారు.

Read more RELATED
Recommended to you

Latest news