రాగి జావాపై ఐదు కోట్లతో పబ్లిసిటీ అవసరమా? – వైసీపీ ఎంపి

-

 

కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా స్కూల్ పిల్లలకు రాగి జావా అందజేసే కార్యక్రమానికి ఐదు కోట్లతో జాతీయ, ప్రాంతీయ దినపత్రికలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రచారం చేసుకోవడం అవసరమా అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 60% నిధులను కేటాయిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40% నిధులను మాత్రమే ఖర్చు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ వాటా సొమ్మును సత్య సాయి ట్రస్ట్ తన వంతుగా 86 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిందని, అయితే పత్రికలకు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటోతో పాటు, 86 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సత్యసాయి గారి ఫొటోలు లేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి గారి చిక్కటి చిరునవ్వులను చిందించే ఫోటో మాత్రమే పత్రికల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో ఉండడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news