త్వరలో సిద్దిపేటకు రైలు మార్గం – హరీష్ రావు

-

ఆదివారం సిద్దిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్ లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో భవన నిర్మాణ కార్మికుల కృషి ఎంతో ఉందని అన్నారు. సిద్దిపేట భవన నిర్మాణ కార్మికుల వెసులుబాటు కోసం క్యాంపు కార్యాలయంలో పిఎను ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

మరో మూడు నెలల్లో అత్యుత్తమ అంతర్జాతీయ ఎల్ అండ్ టీ నిర్మాణ కంపెనీ ద్వారా కార్మికులకు శిక్షణ శిబిరాన్ని హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలో ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా సిద్దిపేటలో ఒక విమాన సౌకర్యం తప్ప అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే రాబోయే రోజుల్లో సిద్దిపేటకు రైలు మార్గం వస్తుందని తెలియజేశారు. సిద్దిపేటకే అన్ని తీసుకెళ్తున్నావని అందరూ నన్ను తిడతారని, కానీ సిద్దిపేట ప్రజలు నా కుటుంబ సభ్యులతో సమానమని అన్నారు మంత్రి. ఈ బడ్జెట్ లో భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ అందించాలని నిర్ణయం తీసుకున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news