BREAKING : రైతులకు శుభవార్త.. నేటి నుంచే రైతు బంధు నిధులు విడుదల

-

తెలంగాణలో ఇవాల్టి నుంచి పదో విడత రైతుబంధు నిధులు విడుదల కానున్నాయి. పదో విడత రైతుబంధుకు కింద ప్రభుత్వం 7వేల676 కోట్ల 61 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు సాయం అందనుంది. 70లక్షల54 వేల మంది రైతుల ఖాతాల్లోకి నేటి నుంచి విడతల వారిగా నగదు జమకానుంది. ఎకరానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందనుంది.

 

గత వానాకాలం 65 లక్షల మంది అర్హులైన రైతులకు 7వేల434కోట్ల67 లక్షల రైతుబంధు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది.ఇదిలా ఉంటే.. రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేయాలని రైతులు నినదిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుభీమా, సాగుకు ఉచిత కరంటు, సాగునీళ్లు ఇలా రైతుల హక్కుల కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news