రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు : హుజురాబాద్‌ తిప్పి..తిప్పి కొడతారు !

-

హుజురాబాద్‌ ఉప ఎన్నికపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ఉత్తుత్తి స్కీమ్ లు పెడుతున్నారని… అక్కడ అధికార టీఆర్‌ఎస్‌ గెలిచే పరిస్థితి లేదని జోష్యం చెప్పారు రాజాసింగ్‌. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ చేశారని….ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఫైర్‌ అయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు తిప్పి తిప్పి కొడతారని హెచ్చరించారు.

గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు అద్వాన్నంగా తయారు అయ్యాయని… చిన్న వర్షానికే వాటర్ జమ అవుతుంది… అందులో పడి చనిపోతున్నారని నిప్పులు చెరిగారు. అయ్యా కొడుకులు ఒకసారి బైక్ మీద తిరిగితే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది.

గ్రేటర్ కమిషనర్ ను అడిగితే ఫండ్స్ లేవు అని అంటున్నారని… నేనే నెలకు కోటి రూపాయల అప్పు కడుతున్నానని చెబుతున్నాడని మండిపడ్డారు. రోడ్లు పనులు జరగకుండా టీఆర్ఎస్‌ నేతలు అడ్డుకుంటున్నారని రాజాసింగ్‌ నిప్పులు చెరిగారు. ప్రతి విషయంలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ థర్డ్ క్లాస్ రాజకీయాలు చేస్తుందని ఫైర్‌ అయ్యారు..

Read more RELATED
Recommended to you

Latest news