రేవంత్‌ ది కాంగ్రెస్‌ రక్తం కాదు..టీడీపీ రక్తం -రాజగోపాల్ రెడ్డి

-

రేవంత్‌ ది కాంగ్రెస్‌ రక్తం కాదు..టీడీపీ రక్తం కాదంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి జెపి నడ్డా సమక్షంలో బిజెపి పార్టీలో చేరిన నిర్మల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరడంతో నిర్మల్, అదిలాబాద్ తో పాటు తెలంగాణలో నూతన ఉత్సాహం వచ్చిందని తెలిపారు.

కాంగ్రెస్ నాయకులారా నిర్ణయం తీసుకొండి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తారా? మూడు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన నిజాయతికి మారుపేరు అభివృద్ధిలో దేశానికి మంచిపేరు తెస్తున్న నరేంద్రమోడీ నాయకత్వంలో పనిచేస్తారా ఆలోచించండి అని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ మరి ఇతర పార్టీల నుండి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన నచ్చక అనేక మంది అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనది కాంగ్రెస్ రక్తం కాదు తెలుగు దేశం రక్తం అని అన్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో కాంగ్రెస్ నుండి బిజెపి లో చేరికలు ఉంటాయి. రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news