నిజామాబాద్ జిల్లా ISI కి అడ్డగా మారింది – రాజా సింగ్

-

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరిలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం ను స్పీకర్ పోచారం రెండుగా విభాగించి ఇద్దరి కొడుకులకు పంచారన్నారు. ఒకరికి ఇసుక మాఫియా ఇంకొక్కరికి కంకరా మాఫియా అప్పచెప్పారని పేర్కొన్నారు.

బాన్సువాడ లో టీఆర్ఎఎస్ పార్టీని కూలదోయటానికి హైదరాబాద్ బుల్ డోజార్ తెప్పిస్తామని..నిజామాబాద్ జిల్లాను isi కి అడ్డాగా చేశారని ఆరోపణలు చేశారు. Pfi సభ్యులు నిజామాబాద్ అడ్డాగా 200 మందికి ట్రైనింగ్ ఇచ్చి హిందువులపై దాడికి కుట్రలు పన్నుతున్నారన్నారు. ఈ కుట్రలను బీజేపీ తిప్పి కొడుతుంది అని హెచ్చరించారు రాజా సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news