రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కు రాజాసింగ్ హెచ్చరికలు !

-

రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. రాజాసింగ్ ఆధ్వర్యంలో ఇవాళ జరగబోయే శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి నిరాకరించారు పోలీసులు. శ్రీరామనవమి శోభయాత్రకు అనుమతి లేదన్న లేఖను రాజాసింగ్ కు అందజేశారు పోలీసులు. దీంతో ఎవరు అనుమతి ఇచ్చినా ఇవ్వకుండా శ్రీరామనవమి శోభయాత్ర చేసి తీరుతానంటున్నారు రాజాసింగ్. 45 రోజుల క్రితం పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు వచ్చి పర్మిషన్ లేదంటే ఎలా..? ఇన్ని రోజుల సంధి పోలీసులు ఏం చేశారు..? అంటూ నిలదీశారు.

rajasingh warns cm revanth reddy

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందులో పండుగల పైన అణిచివేత ఉంటుందని మేము ముందే ఊహించామని… కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, కేరళ రాష్ట్ర లలో సైతం ఇదేదేవిధంగా హిందూ పండుగలు పైన కేసులు బుక్ చేస్తున్నారని ఆగ్రహించారు. 12 గంటలకు గోషామాల్ ఆకాష్ పురి హనుమాన్ దేవాలయం నుంచి శోభాయాత్ర చేసి తీరుతానని హెచ్చరించారు. శోభ యాత్రను ఎవరు పాలేరు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన మీరు హిందూ పండుగలను అడ్డుకోవాలని ఉంటే గత ముఖ్యమంత్రి వచ్చిన పరిస్థితి మీకు వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్.

Read more RELATED
Recommended to you

Latest news