రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా చేసిన పార్టీ టీడీపీ : చంద్రబాబు

-

పట్టాదారు పాసుపుస్తకంపై జగన్‌ తన ఫొటో వేసుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజల భూములను జగన్‌ పేరుతో రాసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.తన భూములను ఇతరుల పేరిట మార్చారని తీవ్ర ఆవేదనకు గురై ఓ చేనేతకారుడు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులూ చనిపోయారన్నారు. నంద్యాల జిల్లా డోన్‌లో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ….ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ద్వారా జగన్‌.. ప్రజల ఆస్తులు కొట్టేసే యత్నం చేస్తున్నారని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీది సామాజిక న్యాయమని, జగన్‌ది సామాజిక ద్రోహమని చంద్రబాబు మండిపడ్డారు. ” రాయలసీమకు వైకాపా నాయకులు ఏమైనా చేశారా?ప్రాజెక్టులు కట్టారా? రోడ్లు వేశారా? పరిశ్రమలు తెచ్చారా? అని ప్రశ్నించారు. ఏమీ చేయని నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలి? పార్టీ రంగుల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు అని మండిపడ్డారు.సైకో జగన్‌కు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి అని అన్నారు సిబియన్.రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా చేసిన పార్టీ టీడీపీ” అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news