నన్ను చంపేలా ఉన్నారు..సెక్యూరిటీ ఇవ్వండి – రాజాసింగ్ తరపు న్యాయవాది

-

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రాజాసింగ్ తరపు న్యాయవాది కరుణ సాగర్ లేఖ రాశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కు లేఖ రాసిన కరుణ సాగర్… తనకు రక్షణ కల్పించాలని లేఖ లో పేర్కొన్నారు. ఇటీవల రాజాసింగ్ కేసులో నాంపల్లి కోర్టు లో బెయిల్ ఇప్పించిన కరుణ సాగర్…. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

రాజాసింగ్‌ కు బెయిల్‌ ఇప్పిచ్చిన అప్పటి నుండి గుర్తు తెలియని ఆగంతకులు బెదిరింపులకు గురించేస్తున్నారని లేఖ రాశారు కరుణ సాగర్. ఇటీవల హైకోర్టు గేట్ వద్ద తనపై దాడి జరిగిందని లేఖ లో పేర్కొన్నారు కరుణ సాగర్. ఎలాగైనా తనకు రక్షణ కల్పించాలని కోరిన కరుణ సాగర్ లేఖ రాశారు. అయితే.. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా.. ముస్లిం వర్గీయులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాత బస్తీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news