రాజస్థాన్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలని నిర్భయ తల్లి డిమాండ్!

-

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం, ధరల పెరుగుదలపై నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ ఆందోళన కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. దేశంలో హత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. వీటికి కొత్త చట్టలే కారణమని వ్యాఖ్యానించారు. అత్యాచారాలకు పాల్పడే వారిని ఉరితీసే చట్టం అమలులోకి వచ్చిన తర్వాతే అత్యాచారాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.

అశోక్ గెహ్లాట్
అశోక్ గెహ్లాట్

అయితే పరోక్షంగా నిర్భయ చట్టాన్ని ఉద్దేశించి మాట్లాడటంతో బీజేపీతోపాటు ఇతర రాజకీయ పార్టీలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో నిర్భయ తల్లి ఆశాదేవి కూడా స్పందించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. నేరస్తులకు మద్దతు ఇచ్చేలా గెహ్లాట్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ప్రజల మనస్థత్వంలో మార్పు రాకపోవడమే అమ్మాయిల హత్యాచారానికి కారణమని ఆమె పేర్కొన్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news