ఐపీఎల్ 15వ మ్యాచ్‌.. బెంగళూరు టార్గెట్ 155..

-

అబుధాబిలో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 15వ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 154 ప‌రుగులు చేసింది. మ్యాచ్‌లో రాజ‌స్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది.

rajasthan made 154 runs against bangalore in ipl 2020 15th match

రాజ‌స్థాన్ బ్యాట్స్‌మెన్ల‌లో ఎంకే లామ్‌రార్ (47 ప‌రుగులు, 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు), ఆర్ తెవాతియా (24 ప‌రుగులు నాటౌట్‌, 3 సిక్స‌ర్లు)లు రాణించారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో చాహ‌ల్ 3 వికెట్లు తీయ‌గా, ఉదానాకు 2 వికెట్లు ద‌క్కాయి. సైనీ 1 వికెట్ తీశాడు.

కాగా రాజ‌స్థాన్ జ‌ట్టు బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైంది. బెంగళూరు బౌల‌ర్లు విజృంభించ‌డంతో ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా వికెట్ల‌ను పారేసుకున్నారు. ఆర్‌సీబీ జ‌ట్టు 3 ఓవ‌ర్ల‌లోనే రాజ‌స్థాన్‌కు చెందిన 3 కీల‌క వికెట్ల‌ను తీసింది. దీంతో రాజస్థాన్ త‌క్కువ స్కోరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news