అవసరమైతే అగ్నిపథ్/అగ్నివీర్ స్కీమ్ ను మారుస్తాం : రాజ్నాథ్ సింగ్

-

రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అగ్నిపథ్, అగ్నివీర్ పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమలవుతున్న అగ్నిపథ్ లేదా అగ్నివీర్ రిక్రూట్మెంట్ స్కీమ్లో అవసరమైతే మార్పులు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. టైమ్స్ నౌ సమ్మిట్లో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అగ్నివీరుల భవిష్యత్తులను సురక్షితంగా ఉంచేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హామీ ఇచ్చారు.

‘సేనా మే యూత్‌ఫుల్‌నెస్ హోనీ చాహియే (సైన్యంలో యువత ఉండాలి). దీని పట్ల ప్రస్తుత యువతరం ఉత్సాహంగా ఉందని నేను భావిస్తున్నా. వీరంతా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారని నమ్ముతున్నాను. ఈ పథకం (అగ్నివీర్)లో భాగంగా వీరి భవిష్యత్తులను సురక్షితంగా ఉంచేందుకు మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవసరమైతే మరిన్ని మార్పులు చేసేందుకు కూడా కట్టుబడి ఉన్నాం’ అని రాజ్నాథ్ పేర్కొన్నారు. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం 2022 జూన్లో ‘అగ్నిపథ్‌’ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news