వాళ్ల అంతు తేల్చేందుకే తూ.గో జిల్లాలో పోటీ చేస్తున్నా : పవన్ కళ్యాణ్

-

కాకినాడ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్, కన్నబాబులపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.కాకినాడ రూరల్ సభలో పవన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…’వాళ్లిద్దరికి నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ మండిపడ్డారు. వాళ్ల అంతు తేల్చేందుకే తూ.గో జిల్లాలో పోటీ చేస్తున్నా. కూటమి అధికారంలోకి రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం అని హామీ ఇచ్చారు.

డొక్కు స్కూటర్పై తిరిగే కన్నబాబు చిరంజీవి భిక్షతో ఈ స్థాయికి వచ్చారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కన్నబాబు ఈరోజు వెయ్యి కోట్ల ఆస్తి సంపాదించాడు. ఇక్కడ వాకలపూడి లో 4.86 ఎకరాల భూమి లే అవుట్ వేసి, 20 మందికి స్థలాలు అమ్మాడు, తరవాత కడప నాయకుడు ఒకరు వచ్చి స్థలం నాది అని గోడ కట్టేసుకుంటే భూములు కొన్నవారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news