మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ డేట్ ఫిక్స్ చేసిన చిత్ర బృందం. మార్చి 1వ తేదీన అంటే మహా శివరాత్రి పండుగ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను వదిలి చిత్ర బృందం.