కల్వకుంట్ల కవిత కు రామోజీరావు బహిరంగ లేఖ !

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కల్వకుంట్ల కవిత… మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గా విజయం సాధించారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ కోటాలో కాంగ్రెస్ పార్టీ, అలాగే బిజెపి పార్టీలు పోటీ చేయకపోవడంతో… కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం అయింది. అయితే ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత విజయం సాధించడంపై… ఈటీవీ ఛానల్, ఈనాడు న్యూస్ పేపర్ అధినేత రామోజీరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కల్వకుంట్ల కవిత కు రామోజీరావు లేఖ కూడా రాశారు.

“ఏకగ్రీవంగా ఎన్నికైన కవిత గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగించి.. ప్రాబల్యం చాటుకున్న మీరు శాసనమండలిలో ప్రజావాణి ని మరింత గట్టిగా వినిపించి నాయకురాలిగా ఇనుమడించిన కీర్తి గడిస్తారని విశ్వసిస్తున్నాను. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుతున్నాను”రామోజీరావు లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news