మహారాష్ట్రలో దారుణం. 14 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం..6 నెలల నుంచి అఘాయిత్యం

-

వావీ వరసలు మరచి ప్రవర్తిస్తున్నారు కామాంధులు. బిడ్డ, మనుమరాలు వయసున్న వారిని కూడా వదలడం లేదు. ప్రతీరోజు ఎక్కడోచోట అత్యాచార ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ, దిశ వంటి చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన భయపడటం లేదు కామాంధులు. తాజాగా మనవరాలు వయస్సున్న బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

RAPE

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర ఠాణే జిల్లాలో ఆరు నెలలుగా 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు 60 ఏళ్ల వృద్ధుడు. తన ఇంట్లో పని చేస్తున్న బాలికపై కన్నెేసిన యజమాని పలుమార్లు అత్యాచాారానికి పాల్పడ్డాడు. ఆరునెలులగా సాగుతోంది ఈ అఘాయిత్యం. బాధిత బాలిక తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి జీవిస్తోంది. బాధితురాలు .. సదరు వృద్ధుడి ఇంట్లో పనుల చేస్తూ.. పశువులను కాస్తూ జీవిస్తోంది. ఇదిలా ఉంటే వృద్ధుడు బాలిపై అత్యాచారానికి పాల్పడుతూ.. ఎవరికి చెప్పకూడదని బెదిరించాడు. దీన్ని గమనించిన తల్లి ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది. వారి సహకారంతో స్థానిక సామాజిక సంస్థను సంప్రదించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితున్ని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news