హోం గ్రౌండ్‌లో గెలిచిన ఆర్సీబీ

-

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో బెంగ‌ళూరు 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో దేవదత్ పడిక్కల్ (52; 34 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) అర్థ‌శ‌త‌కంతో రాణించ‌గా య‌శ‌స్వి జైశ్వాల్‌(47; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఆఖ‌ర్లో ధ్రువ్ జురెల్(34 నాటౌట్‌; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స‌ర్లు) జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌ల‌య‌త్నం చేశారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ మూడు వికెట్లు తీయ‌గా, డేవిడ్ విల్లీ, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క‌ముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్టపోయి 189 ప‌రుగులు చేసింది. బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(77; 44 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్స‌ర్లు), ఫాఫ్ డుప్లెసిస్‌(62; 39బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. విరాట్ కోహ్లి(0), లోమ్రోర్‌(8), దినేశ్ కార్తిక్‌(16)లు విఫ‌లం అయ్యారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శ‌ర్మ చెరో రెండు వికెట్లు తీయ‌గా ర‌విచంద్ర‌న్ అశ్విన్, చ‌హ‌ల్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news